– బ్యాంక్లకు మంత్రి సీతారామన్ ఆదేశాలు
ముంబయి : ఆర్థిక సంస్థలు తప్పకుండా ఖాతాదారులకు సంబంధించిన నామినీల (వారసుల) పేర్లను తప్పకుండా నమోదు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భవిష్యత్లో క్లెయిము చేసుకోని నగదు సమస్య రాకుండా బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో సహా అన్ని ఆర్థిక సంస్థలు నామినీల పేర్లను తీసుకోవాలని ఆదేశించారు. తమ ఖాతాదారుల నామినీల పేర్లు, చిరునామాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలన్నారు.