బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

– ఎంపీపీ మాడుల ప్రభాకర్ రెడ్డి
నవ తెలంగాణ- భూదాన్: పోచంపల్లి  పార్టీ నాయకులు కార్యకర్తలు సైనికునిగా పనిచేసే పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు గురువారం దంతూరు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి పాల్గొని సందర్భంగా మాట్లాడుతూ గతంలో గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదు పైల శేఖర్ రెడ్డి పది సంవత్సరాల కాలంలో పోచంపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు కార్యకర్తలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లి పైల శేఖర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ పెన్షన్లు గ్రామాలలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులేకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధర కల్పించిన ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేశం పార్టీ అధ్యక్షులు పార్టీ సుధాకర్ రెడ్డిసింగల్ విండో చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి రావుల శేఖర్ రెడ్డికోట మల్లారెడ్డి ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలం సర్పంచి తోటి కుమారు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love