ఎక్సలెంట్‌ ఒలంపియాడ్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు

నవతెలంగాణ-మణుగూరు
మణుగూరులోని ఎక్సలెంట్‌ స్టార్‌ హై స్కూల్లోని మూడు, నాలుగు, ఐదు ఒలంపియాడ్‌ స్టార్‌ తరగతుల విద్యార్థులకు సోమవారం ఘనంగా నిర్వహించారు. 2023-2024 సంవత్సరానికి గాను చదువుతోపాటు ఇతర సహకార కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభను కనుపరిచిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమానికి మణుగూరు ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి కేవలం చదువులోనే కాకుండా ఆటల్లో ఇతర సంస్కృతిక కార్యక్రమాలలో మంచి ప్రతిభను కనుపరచాలని వారు కోరారు. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థులతో పాటు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న యాజమాన్యాన్ని వారు అభినందించారు. పాఠశాల చైర్మన్‌ యూసఫ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు ఎటువంటి పోటీ విభాగాలలో పాల్గొన్నా తప్పకుండా విజయం సాధించి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ యాకూబ్‌ షరీఫ్‌ ఖాదర్‌, ప్రైమరీ ప్రిన్సిపల్‌ సమీమా నాయక్‌, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love