- Advertisement -
నవతెలంగాణ- (వేల్పూర్) ఆర్మూర్
సహాయ వ్యవసాయ సంచాలకులు ( భీంగల్) ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మ బ్లాక్ స్థాయి రైతు సలహా కమిటీ సమావేశాన్ని మండల కేంద్రంలోని రైతు వేదిక నందు నిర్వహించినట్టు వ్యవసాయ అధికారి రాజా తెలిపారు. ఈ సమావేశంలో ఆత్మ బ్లాక్ చైర్మన్ గా డొల్ల రాజేశ్వర్ రెడ్డి తో పాటు 25 మంది రైతులు సభ్యులుగా నియమించుకోవడం తో పాటు, జిల్లా స్థాయి రైతు సలహా కమిటీకి 8 మంది రైతులను ప్రతిపాదించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచలకురాలు భీంగల్ బి.లావణ్య,భీమ్గల్ డివిజన్ స్థాయి మండల వ్యవసాధికారులు ,బిటిఎం అనూష , ఏ.ఈ.ఓ లు బ్లాక్ స్థాయి రైతు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



