– బైక్ను, లారీని ఢకొీన్న స్కార్పియో వాహనం
– ఐదుగురు దుర్మరణం
మదనపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం… మదనపల్లె రామారావు కాలనీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో బెంగళూరుకు వారి సొంత పనిపై వెళ్లారు. పని ముగించుకుని ఆదివారం బెంగుళూరు నుంచి మదనపల్లెకు తిరుగు పయనమయ్యారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మదనపల్లె మండలం బార్లపల్లె వద్దకు రాగానే పాలు పోయడానికి బైక్పై వెళ్తున్న కోళ్లవారిపల్లెకు చెందిన ఇద్దరు రైతులు చంద్ర (50), సుబ్రమణ్యం (62)లను వారి వాహనం ఢకొీట్టింది. దీంతో, రైతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని స్కార్పియో కారు వేగంగా ఢకొీంది. దీంతో, ఆ వాహనంలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మణం చెందారు. వారిలో తిలక్, విక్రమ్, శ్రీను ఉన్నారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. డిఎస్పి ప్రసాద్రెడ్డి, సిఐ సోమశేఖర్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులందరూ మదనపల్లి పట్టణం, రూరల్ మండలానికి చెందివారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బార్లపల్లె వాసులు చెప్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మదనపల్లె నియోజకవర్గ వైసిపి కన్వీనర్ నిస్సార్ అహ్మద్ పరామర్శించారు.