ఘనంగా మాజీ సీఎం ఎన్టీఆర్‌ జయంతి

– నివాళులర్పించిన పలువురు నేతలు
– పలు చోట్ల అన్నదానం కార్యక్రమాలు
నవతెలంగాణ-కాప్రా
దివంగత నాయకులు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 101వ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌ ప్రధాన కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి కార్పొరేటర్‌ జెర్రిపోతుల ప్రభుదాస్‌, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదాస్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపిన మహనీయుడని పేర్కొన్నారు. అనంతరం నందమూరి తారక రామారావు అన్నదాన ట్రస్టు ద్వారా 2500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, స్థానిక నాయకులు టీజీకే. మూర్తి, మన్నె సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఉమా మహేశ్వరరావు (చిన్నా) జలగం వెంకటేష్‌, వీరభద్రరావు అమర కుమార్‌, సురేందర్‌, నరసింహారావు, సురేష్‌, సాయి సుధీర్‌, బక్కని నర్సింహులు, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, నర్సిరెడ్డి, అశోక్‌ కుమార్‌ గౌడ్‌, పీపీ. ప్రసాద్‌, తాతినేని భాస్కర రావు, బండి వేంకటేశ్వర రావు, నాగ మల్లీశ్వరి, మల్లేష్‌గౌడ్‌, పూస రమేష్‌, చక్రవర్తి, బాలయ్య గౌడ్‌, శేఖర్‌ గౌడ్‌, నిస్సార్‌ అహ్మద్‌ ఘోరి, దండెం నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్‌లో..
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని కుషాయి గూడ బస్టాండ్‌లోని ఎన్టీర్‌ చిత్ర పటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కషి చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షులు జి.రాములు యాదవ్‌, జిల్లా కార్యదర్శి రుద్రగోని రాంచందర్‌ గౌడ్‌, సత్యం యాదవ్‌, కే. ప్రేంకుమార్‌ గౌడ్‌, ఎన్‌. బాల కష్ణాగౌడ్‌, కష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్‌రావు నగర్‌ డివిజన్‌లో..
నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఏఎస్‌రావు నగర్‌ డివిజన్‌ పరిధిలోని హై టెన్షన్‌ రోడ్డులో గూడపాటి ఫౌండేషన్‌ చైర్మెన్‌ గూడపాటి శరత్‌ సహకారంతో తెలుగు యువత మల్కాజిగిరి పార్లమెంట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీజీకే మూర్తి, గూడపాటి ఫౌండేషన్‌ చైర్మెన్‌ గూడపాటి శరత్‌ హాజరయ్యారు.
జమ్మిగడ్డలో..
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా కాప్రా పరిధిలోని జమ్మిగడ్డ ఎన్టీఆర్‌ కూడలి వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నీరుకొండ సతీష్‌ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మాజీ అధ్యక్షులు బక్కని నర్సింహులు, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌, మల్కాజిగిరి మేడ్చల్‌ జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులు కందికంటి అశోక్‌ కుమార్‌గౌడ్‌, మల్కాజిగిరి మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డ మీది రాములు యాదవ్‌, పార్లమెంట్‌ కార్యనిర్వహణ కార్యదర్శి రాంచందర్‌ గౌడ్‌, ఎస్సీసెల్‌ రాష్ట్ర సెక్రటరీ శ్రీరాములు, నాయకులు ఉపేందర్‌, ఎస్‌వీ.రావు, రామ్మోహన్‌, మూర్తి, వెంకటేష్‌, రమేష్‌ , నవీన్‌, శ్రీనివాస్‌, వర్మ , పరందామయ్య, జనార్ధన్‌, కష్ణ, సత్యం యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love