టీఎస్‌పీఎస్సీ కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ..

నవతెలంగాణ- హైదరాబాద్ :  టీఎస్‌పీఎస్సీ  ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి ఈ పదవిలో ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆయన రాజీనామా చేశారు.
కొత్త టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సమర్థత, భద్రత, విశ్వసనీయత అంశాలను పరిగణలోకి తీసుకుని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మహేందర్​రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును ఆమోదించారు గవర్నర్ తమిళిసై.

Spread the love