కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం

– ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
– కడ్తాల్ మండలంలో గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్
 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండలంలోని కానుగుబాయి తాండా, గానుగుమర్ల తాండా తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకు ఎటా ఎకరాకు రూ.15,000లు, కౌలు రైతులకు రూ.12,000 లతో పాటు వరి పంట క్వింటాలుకు రూ.500లు బోనస్ అందజేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు, ఇండ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు తదితర పథకాలను పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, సర్పంచ్లు హంస మోత్య నాయక్, రాము నాయక్, ఎంపీటీసీ సభ్యులు పాలకుర్ల రాములు, నాయకులు హన్మా నాయక్, వేణుగోపాల్ పంతులు, రాంచందర్ నాయక్, ఎక్బాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Spread the love