నవతెలంగాణ – హైదరాబాద్
ఆల్వాల్లో గద్దర్ స్థాపించిన మహోబోధి విద్యాలయంలో సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. స్కూల్ ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన సతీమణి విమల సూచించిడంతో కుటుంబీకులు, కళాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్నది గద్దర్ చివరి కోరికని ఆయన తనయుడు మీడియాకు తెలిపారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్కు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం భూదేవి నగర్లోని గద్దర్ ఇంట్లో కొద్దిసేపు పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గద్దర్ అంత్యక్రియలను కేసీఆర్ సర్కార్ అధికారిక లాంఛనాలతో జరపాలని కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.