నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణ ప‌త‌కం..

నవతెలంగాణ – హైదరాబాద్: టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విజేత, భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్‌ నీర‌జ్ చోప్రా పావో నుర్మి గేమ్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జ‌రిగిన టోర్నీలో జావెలిన్‌ను ఏకంగా 85.97 మీట‌ర్లు విసిరి స‌త్తా చాటారు. ఎనిమిది మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో త‌న మూడో ప్ర‌య‌త్నంలో నీర‌జ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడ‌ల్ ద‌క్కించుకున్నారు. ఇక నీర‌జ్‌కు ఈ సీజ‌న్‌లో ఇది మూడో ఈవెంట్‌. గాయం బారిన ప‌డ‌కూడ‌ద‌నే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చెకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్‌కు అత‌డు దూరమయ్యాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ ముందు నీర‌జ్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రోసారి ప‌త‌కంపై భార‌త్ ఆశ‌ల‌ను పెంచేసింది.

Spread the love