![రూ.3.09 కోట్ల విలువైన బంగారం పట్టివేత](https://navatelangana.com/wp-content/uploads/2023/10/janagom-gold.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని అధికరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.