క్యాన్సర్‌తో బాధపడుతున్న డిఫెన్స్‌ ఉద్యోగుల సంఘం నేత గోపాల్‌రావు

– పరామర్శించిన సీపీఐ(ఎం) నేత డీజీ నరసింహరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
డిఫెన్స్‌ ఉద్యోగుల సంఘం ఆలిండియా నాయకులు జీటీ గోపాల్‌రావు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. నాలికకు శస్త్ర చికిత్స చేసి 40శాతం తొలగించారు. ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్‌ అయి బడంగ్‌పేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు డిజి.నరసింహారావు, పట్నం రాష్ట్ర నాయకులు ప్రసాద్‌, నాయకులు కిషోర్‌ ఆయన్ను పరామర్శించారు. డిఫెన్స్‌ ఉద్యోగిగా నాయ కుడిగా ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు. ఆయన తొందర గా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Spread the love