బూటు పాలిష్ తో జీపీ కార్మికుల నిరసన

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అశ్వారావుపేట మండలం గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర( జేఏసీ)కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 32వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు బూట్ పాలిష్ చేసి నిరసన తెలియజేశారు.  అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం కార్మికులను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు తమ హక్కలను సాధించుకునేందుకు పోరాటాల ద్వారా సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య,కేసుపాక నరసింహారావు, గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ గౌరవ అధ్యక్షులు మూల అప్పన్న,మట్లకుంట కామేశ్వరరావు,మండల ట్రెజరర్ వేల్పుల ముత్తా రావు, మండల కమిటీ సభ్యులు మురళి,ఆరేపల్లి నాగేంద్రరావు, కట్ట శీను,రాజపుత్ర రంజిత్ సింగ్(నందు),బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ,బద్దే లక్ష్మి,పద్మ, జ్యోతి, తిరుపతమ్మ అలివేలు రాణి,శ్యామ్, రమాదేవి, స్వప్న, రాధాకృష్ణ , ఇంద్ర,రాణి, అల్లాడి కుమారి నాగమణి,మరియమ్మ,రాము తదితరులు పాల్గొన్నారు
Spread the love