శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో నర్సరీ నుండి తొమ్మిదవ తరగతి వరకు గల విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు  గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ద్వారా మంచి ఉల్లాసాన్ని అందించడానికి ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాలలో గ్రాడ్యుయేషన్  డే వేడుకలు నిర్వహించడం పట్ల విద్యార్థుల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు. పాల్గొన్నారు.

Spread the love