– విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలి
– జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సతీష్ కుమార్
నవతెలంగాణ-ఐడీఏబొల్లారం
విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జారు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ సతీష్ కుమార్ అన్నారు. జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న తనం నుంచే క్రమశిక్షణతో చదివితే.. భవిష్యత్లో అత్యున్న తమైన శిఖరాలకు చేరుకుం టారన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాల న్నారు. విద్యార్థుల ప్రతిభ ముందే గుర్తించి వారిని ఆ దిశగా అడుగులు వేయించాలన్నారు. ఈ జారు ఇంటర్నేషనల్ స్కూల్లో నిష్ణాతులైన ఉపాద్యాయులతో అత్యత్తమ విద్యను అందించడమే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నా మన్నారు. అంతకు ముందు విద్యార్థులు ఉపాధ్యా యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో జారు ఇంటర్నేషనల్ స్కూల్ సహ వ్యవస్థా పకులు, ప్రిన్సిపాల్ స్మిత భోగరాజు, వైస్ ప్రిన్సిపాల్ నాగమ ణి, ఉపాద్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.