ఘనంగా స్నేహితుల దినోత్సవం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని హుస్నాబాద్ కు చెందిన 1988 ఎస్ఎస్సి సి బ్యాచ్ , అంతకపేట కు చెందిన 1999 ఎస్ ఎస్ సి కి చెందిన స్నేహితులు అందరూ ఆదివారం వేరువేరుగా హుస్నాబాద్ లో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న మాట్లాడుతూ చిన్ననాడు స్నేహం 50 ఏళ్లు పైబడ్డ ఒకరికి ఒకరికి తోడుగా నిలుస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ స్నేహంతో  నేటికీ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే వినియోగదారుల ఫోరం మాజీ డైరెక్టర్  వడ్డేపల్లి వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు గంగిశెట్టి మహేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అయితే శ్రీధర్,  బండారి రామనారాయణ, పామర రవీందర్ తో పాటు స్నేహితులు పాల్గొన్నారు.
Spread the love