చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ

నవతెలంగాణ – అమరావతి: చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై సీజేఐ చంద్రచూడ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రం వరకు తెలియనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పిటిషన్​పై బుధవారం విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

Spread the love