సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ముద్దుబిడ్డ హర్షితకు సన్మానం

– డాక్టర్ గా ఎదిగి మద్నూర్ వాసులకు వైద్య సేవలు అందించాలి సన్మానంలో పెద్దలు

నవతెలంగాణ -మద్నూర్
మున్నూరు కాపు ముద్దుబిడ్డ అయినా నాగం వార్ హనుమాన్లు సార్ కూతురు హర్షిత నీటిలో రాష్ట్రంలో 412 ర్యాంకు సాధించి హైదరాబాదులోని ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో సీటును సాధించగా మద్నూర్ గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆ ముద్దుబిడ్డ ఈ ర్యాంకు సాధించినందుకు సంగం నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పెద్దలు మాట్లాడుతూ డాక్టర్ గా ఎదిగి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించాలని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు ఎస్ గంగారం మద్నూర్ గ్రామ అధ్యక్షులు డాక్టర్ విజయ్, జనరల్ సెక్రెటరీ ఎస్ హనుమాన్లు, ఉపాధ్యక్షులు కే సాయిలు, క్యాషియర్ సంగం సభ్యులు పి హనుమాన్లు, ఎస్ సాయిలు, బి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love