గృహబంధాలు అరెస్టుల పర్వం

– ఖండించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
– అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి
నవ తెలంగాణ- కంటేశ్వర్:
నిజామాబాద్ జిల్లాకు నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం నాయకులను గృహనిర్బంధాలు అరెస్టులు పోలీసులు చేస్తున్నారని దీనిని తీవ్రంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఖండించారు అరెస్టు చేసిన సిపిఎం పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ మూడో టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మంగళవారం ఉదయాన్నే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబును గృహనిర్బంధం చేయడం జరిగింది. తనతో పాటు ఆరో టౌన్ లో గోవర్ధన్  జిల్లాలోని మోర్తాడ్ వేల్పూర్ ఎర్రగట్ల మోపాల్ వర్ని బోధన్ డిచ్పల్లి తదితర మండలాల్లో అంగన్వాడీ ఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాయకుల పర్యటనల సందర్భంగా పోరాడే వారి నోరుమూయించటం సరైనది కాదని తెలియజేస్తున్నాం అని తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు
Spread the love