ఒకప్పుడు జ్ఞాపకాలు, అనుభవాల సమూహాలు
ప్రస్తుతం ఆ భావోద్వేగ అంశాలకు చోటే లేదు
వేగంగా సిద్ధమయ్యే ‘రెడీమేడ్ హౌమ్స్’గా మారుతున్న వైనం
సోషల్ మీడియా, ట్రెండ్లు, జీవనశైలి ప్రభావం
న్యూఢిల్లీ : ఒకప్పుడు ఇండ్లు సంవత్సరాల పాటు క్రమంగా రూపుదిద్దుకునేవి. పునాది నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు.. ప్రతి వస్తువూ, ప్రతి అలంకరణ వెనుక ఒక కథ, ఒక జ్ఞాపకం వంటి అనుభవాలు ఉండేవి. సాధారణంగా ఒక మధ్యతరగతి మనిషి జీవితంలో ఇల్లు కట్టడం పెద్ద పనే అయినా.. ఆ కష్టంలోనూ వెలకట్టలేని ఆనందం ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్లు, వేగవంతమైన జీవ నశైలి ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. ఇండ్లు కదలిస్తే కన్నీళ్లే ఎదుర్కొంటున్న సమస్యల జాబితాలో ఉన్నాయి.
కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టని యూపీ సర్కారు ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు విమర్శలకు గురవుతున్నాయి. నోయిడాలో ‘ఇండిస్టియల్ పీస్’ కోసం ప్రత్యేక పోలీస్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యగా చూస్తోంది. అయితే కార్మికుల అసలు సమస్యలు మాత్రం.. వేతనాలు, హక్కులు, భద్రత. వీటిని పరిష్కరించడంలో మాత్రం యూపీ సర్కారు ఆసక్తి చూపడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యోగి సర్కారు ఎదురుదాడి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కార్మికుల నిరసనలపై యోగి సర్కారు ఎదురుదాడికి దిగడం. నోయిడా అల్లర్లకు బాహ్యశక్తులు కారణమనీ, ఇందులో పాకిస్తాన్ హస్తం, అర్బన్ నక్సల్స్ హస్తం ఉందని బీజేపీ సర్కారు ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. కార్మికులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ.. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు జరిపిన ఈ నిరసనల్లో కేవలం ఫ్యాక్టరీ కార్మికులే కాకుండా గృహ కార్మికులు, విశ్వవిద్యాలయ సిబ్బంది కూడా చేరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. అంటే ఇది ఒక విస్తృత కార్మిక సంక్షోభంగా మారుతోందని మేధావులు చెప్తున్నారు. చరిత్రలో కూడా ఒప్పంద కార్మిక వ్యవస్థను ప్రోత్సహించరాదని కోర్టులు, కమిషన్లు సూచించాయి. కానీ ప్రస్తుతం విధానాలు మారడంతో, ఈ వ్యవస్థ విస్తరిస్తోంది. ఇది భవిష్యత్తులో కార్మికుల పరిస్థితిని మరింత దారుణంగా మార్చే ప్రమాదం ఉందని మేధావులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అలా చేయకపోతే.. అశాంతి పెరిగే ప్రమాదం
నోయిడా అల్లర్లు కేవలం ఒక ఘటనగా చూడొద్దనీ, దీనిని భారత్లో కార్మికుల సమస్యలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని తెలియజేసే హెచ్చరికగా భావించాలని మేధావులు అంటున్నారు. ప్రభుత్వం సమస్యను లోతుగా అర్థం చేసుకొని, కార్మిక హక్కులను రక్షించే విధానాలను తీసుకురాకపోతే.. ఇలాంటి అశాంతి మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
జీవనశైలి మార్పులు కూడా కారణం
ఇప్పటి తరానికి ఇండ్లు శాశ్వతంగా ఉండవు. ఉద్యోగాల కోసం నగరాలు మారడం, జీవనశైలిలో మార్పులు… ఇవి ఇండ్లను తాత్కాలికంగా మార్చేశాయి. అందుకే ప్రజలు వేగంగా పూర్తయ్యే ఇంటీరియర్లను ఎంచుకుంటు న్నారు. ఇల్లు కొనడం సులభమే.. కానీ ‘ఇల్లు’గా మార్చడం సమయం, అనుభవం, వ్యక్తిగత స్పర్శతోనే సాధ్యం. ట్రెండ్లను అనుసరించడం తప్పుకాదు.. కానీ వాటి వెనుక మన వ్యక్తిత్వాన్ని కోల్పోతే, ఇల్లు కేవలం అందంగా కనిపించే ఖాళీ స్థలంగా మిగిలిపోతుంది.
జ్ఞాపకాలకు చోటు లేదు
మునుపటి కాలంలో ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉండేది. ఒక దీపం.. ప్రయాణంలో కొన్నది కావచ్చు, ఒక ఫర్నిచర్ కుటుంబ సభ్యుల బహుమతి కావచ్చు. ఇవి ఇంటిని కేవలం స్థలంగా కాకుండా భావోద్వేగాలతో నిండిన ప్రదేశంగా మార్చేవి. అయితే ప్రస్తుత తరంలో అలాంటి పరిస్థితులు కనబడటం లేవు. ఇండ్లు కట్టకముందే వస్తువులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. ఎవరితోనూ సంబంధం లేకుండా.. నేను, నా కుటుంబం అనే భావన పెరిగిపోయింది. దీంతో ఇలా సొంతంగా వస్తువులను సమకూర్చుకున్నప్పటికీ.. వాటితో కూడిన ఇండ్లు ‘వ్యక్తిత్వం లేని, సజీవత లేని’ స్థలాలుగా మారుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.



