జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

– రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌
నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
ఎల్బీనగర్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ జేఏసీకి ఇండ్ల స్థలాలను వెంటనే ప్రభుత్వం కేటాయించాలని రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏ.ఎస.్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన మీడియా ప్రతినిధులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఈ సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. జర్నలిస్టుల పెన్నుబలం ఎన్నో కుర్చీలను దింపిందని.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి వారికి తగిన న్యాయం చేయాలన్నారు.లేకుంటే తెలంగాణలో మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

Spread the love