పంచాయితీ కార్మికులకు అండగా నేనుంటా: మాజీ ఎంపి పొంగులేటి

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా నేనుంటానని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎం.పీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక మూడు రోడ్ల కూడలిలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 17 వ రోజుకు చేరుకుంది.పార్టీ కార్యకలాపాలు నిమిత్తం అశ్వారావుపేట వచ్చిన ఆయన సమ్మె శిభిరం వద్దకు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు అండగా ఉంటానని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జారే ఆదినారాయణ, జూపల్లి రమేష్, సర్పంచ్ అట్టం రమ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love