త్రిఫెజు విద్యుత్ ఇచ్చి నట్లు చూపిస్తే నా పదవికి రాజీనామ చేస్తా

–  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నవతెలంగాణ – సిద్దిపేట 
20 గంటలు త్రిఫెజు విద్యుత్ ఇచ్చి నట్లు చూపిస్తే నా పదవికి రాజీనామ చేస్తా అని, మీరు రాజీనామా చేయవల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట లో ఓ పెండ్లికి హాజరైనా ఆయన విలేకరులతో మాట్లాడారు. కోoగరికల వద్ద 17  నా నియోజకవర్గ లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కర్నాటకలో మాదిరిగా  5 కొత్త పథకాలు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేత చెపిస్తామని అన్నారు. 4 కోట్ల ప్రజలు బాగుపడుతారు అని తెలంగాణ ఇస్తే,  కేవలం 400 కుటుంబం లు కెసిఆర్ వి   మాత్రమే బాగుపడుతున్నాయని,  సోనియాగాంధీ బహిరంగ సభలో ఈ విషయం మాట్లాడుతారని అన్నారు. ప్రభుత్వ స్కూల్లో 70 వేల ఖాళీలు ఉంటే 6 వేల ఉద్యోగుల ప్రకటన వేశారని, ఎన్నికలు వస్తున్నాయి అని ప్రజల ను మోసం చేయడానికి దళిత, బీసీ బంధు అని  తెరపైకి తెచ్చారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందనే భయంతో బంద్ పథకాలు ఎన్నికల సమయంలో చేస్తున్నారని అన్నారు. ఎవరైనా గెలిచిన తర్వాత పథకాలను తీసుకురావాలి కానీ, ఎన్నికల ముందు తీసుకురావడం ఏమిటి అని ప్రశ్నించారు. హోం గార్డ్ రవీందర్ ది హాత్మహత్య కాదని,  ప్రభుత్వ హత్య అని అన్నారు.  జీతం అడిగినందుకు ఉన్నత అధికారు బెదిరింపు వల్ల చనిపోయాడని అన్నారు. తెలంగాణ ఇస్తే ఆంద్రప్రదేశ్, తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ  జీరో ఐతది అని తెలిసి కూడా ప్రజలు బాగుపడుతారని తెలిసి తెలంగాణ ను ప్రకటించిందని తెలిపారు. నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి మీద ఉన్నా కానీ పార్టీ మీద ,నాయకులు మీద లేదాని అన్నారు. పనికి రాని పథకాలు పెడితే దళితులు ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నాడు కేసీఆర్, వరంగల్ లో జర్నలిస్ట్ లకు ఇళ్ళు కట్టిస్తా అన్నా కేసీఆర్ మరి చూపిస్తావా అని ప్రశ్నించారు. మంత్రి హరీశ్ రావు రోజు చెప్తున్నాడు కదా విద్యుత్ ను ఇస్తున్నం అని ఎక్కడో చూపించాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబం కు నోర్లు ఉన్నాయ్ వాళ్ళది వల్లే గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
Spread the love