– బాలుడిని చిత్రహింసలు పెట్టిన వారిని అరెస్టు చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్
నవతెలంగాణ-షాబాద్
జామ కాయలు తెంపితే కట్టేసి కొడతారా.. దళిత బాలున్ని తాళ్లతో కట్టేసి.. కొట్టి చిత్ర హింసలు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో రిటైర్డు ఉపాధ్యాయుడు మధుసూదన్రెడ్డి, అతని కుమారుడు కలిసి దళిత బాలుడు బేగరి యాదగిరిని తాళ్లతో కట్టేసి, కాళ్లతో తన్ని కులం పేరుతో దూషించి చిత్రహింసలకు గురిచే శారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, ఎం.ప్రకాష్ శరత్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్తో కలిసి స్కైలాబ్బాబు గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలడిగి తెలుసు కున్నారు. అనరతరం ఆయన మాట్లాడుతూ.. జామకాయలు తెంపుకు న్నాడనే నెపంతో దళిత బాలుడు యాదగిరిని చిత్రహింసలు పెట్టడం సరైంది కాదన్నారు. పోలీసులు వెంటనే తండ్రీకొడుకును అరెస్టు చేయా లని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.