– కాంగ్రెస్ మండలాధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మజీద్ ఆవరణలో కాంగ్రెస్ యువ నాయకులు కే.చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలి.విజరు కుమార్ రెడ్డి హాజర య్యారు. ఈ సందర్బంగా సోదర భావానికి ఇఫ్తార్ విందులు ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు. ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్ర దినంగా పాటిస్తారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా నడుచుకున్న ప్పుడే శాంతి భద్రతలో మార్పు వస్తుందన్నారు. సర్వ మతాలకు వేదిక మన దేశం లౌకిక రాజ్య దేశామన్నారు. ముస్లింల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో అప్షన్ సభ్యులు ఖాజాపాషా, నాయకులు బంగ్లా యాదయ్య గౌడ్, ఖమ్మర్ పాషా, రమేష్ గౌడ్, బస్వారాజ్, గౌస్, జావీద్, మైను, రుక్మదిన్, యాదయ్య గౌడ్, సాజిద్, ముస్లిం పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.