విడిపోయిన దంపతులను కలిపిన ఐకెపి ఎపిఎం

నవతెలంగాణ-భిక్కనూర్
విభేదాలతో విడిపోయిన దంపతులను ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ కలిపారు. అనంతరం ఎపిఎం మాట్లాడుతూ మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన మహిళతో మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది వారికి ఇద్దరూ పిల్లలు ఉన్నారు. కుటుంబ విభేదాల వల్ల గత ఆరు సంవత్సరాలు భార్యాభర్తలు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. ఇట్టి విషయాన్ని వారి పిల్లలు ఐకెపి దృష్టికి తీసుకెళ్ళగా డీపీఎం రమేష్ బాబు, మహిళా సమైక్య అధ్యక్షురాలు ఇరువురిని పిలిచి రాజీ కుదిరించారు. అనంతరం వారిని ఒకటి చేసి కుటుంబ సమేతంగా ఇంటికి పంపించారు.

Spread the love