డాక్టర్ భూపతి రెడ్డి ని సన్మానించిన ఇమ్మడి గోపి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారిగా నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గనికి వచ్చిన సందర్భంగా దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ఆదివారం కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇమ్మడి గోపి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని, దీంతో ప్రజలు ఆగ్రహించి కనివిని ఎరుగని రీతిలో తీర్పు ఇచ్చారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఇమ్మడి గోపి అశాభావం వ్యక్తం చేశారు.  బిఆర్ఎస్ పాలనలో అరాచకం ఎక్కువగా కావడంతో ప్రజలు భరించుకోలేదని నీతి నిజాయితీగా ఉన్న డాక్టర్ భూపతి రెడ్డి ని గెలిపించారని తెలిపారు. అయన హయాంలో నిజామాబాద్ రూరల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Spread the love