కెసిఆర్ పాలనతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం

నవతెలంగాణ- తుంగతుర్తి: అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని సింగారం తండ, కాశితండ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా మెజార్టీ ఏ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన ప్రజల కోసం నిరంతరం పనిచేసే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, సర్పంచ్ పద్మ శంకర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
One
Spread the love