రూ.500 కోట్ల మార్కును దాటిన దక్షిణ మధ్య రైల్వే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నెలవారీ ప్రయాణికుల విభాగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల మార్కును దక్షిణ మధ్య రైల్వే దాటింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సరుకు రవాణా విభాగంలో మే నెలలో 12,517 మిలియన్ టన్నుల అత్యధికంగా నమోదు చేసింది. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ అత్యుత్తమ విజయానికి ఆపరేటింగ్, కమర్షియల్ టీంలను అభినందించారు.