రెండు కొత్త సూపర్‌ ఫాస్ట్‌ లైన్ల సర్వేకు రైల్వేబోర్డు అంగీకారం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్‌ ఫాస్ట్‌ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఆరు నెలల్లో సర్వే పూర్తిచేయాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్‌, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. టెక్నికల్‌ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. ఈ మార్గాల్లో గంటకు గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా సర్వే రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే చేపట్టాలని రైల్వే బోర్డును పలుమార్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.

Spread the love