తెలంగాణలో దారుణం.. మహిళ కాళ్లు నరికి..!

నవతెలంగాణ – సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో ఓ విషాదకర సంఘటన ములుగు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ మైలారం గ్రామానికి చెందిన వెంకటమ్మ(40) అనే మహిళ గ్రామంలో ప్లాస్టిక్ వంటసామగ్రి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నది. గురువారం గుర్తు తెలియని దుండగులు ఆమె రెండు కాళ్లు నరికి హత్య చేశారు. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందగా, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  సమాచారం అందుకున్న గజ్వేల్ ఏసీపీ రమేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకొని డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీం ద్వారా సాక్ష్యాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love