నవతెలంగాణ – ఢిల్లీ: ఈ నెల 20న జరిగిన ఐదో విడత ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం తెలిపింది. 62.2 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించింది. ఐదో విడతలో 8 రాష్ట్రాలు, యూటీల్లోని 49 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే 61.48 శాతం పురుషులు, 63 శాతం మహిళలు, 21.96 శాతం ట్రాన్స్జెండర్లు ఓటు వేసినట్లు ఈసీ వివరించింది.