నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు.