త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రసేనారెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గురువారం అగర్తలాలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంద్రసేనారెడ్డి దంపతులకు ముఖ్యమంత్రి డాక్టర్‌ మాణిక్‌ సాహా, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఘనస్వాగతం పలికారు. ”గార్డు -ఆఫ్‌ -హానర్‌” నిర్వహించారు. ప్రమాణస్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర సీఎం, ఇతర సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యారు.

Spread the love