పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై పరిశీలన

నవతెలంగాణ- నవీపేట్: పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై తహసీల్దార్ ధన్వల్, ఎస్సై యాదగిరి గౌడ్ లు మంగళవారం పరిశీలించారు. మండలంలోని పోతంగల్, హనుమాన్ ఫారం, గాంధీనగర్, జన్నేపల్లి, నారాయణపూర్, సిరన్ పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని,నాలేశ్వర్ బినోల మరియు ఆశ జ్యోతి కాలనీ గ్రామాలలో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో విద్యుత్ మరుగుదొడ్లు త్రాగునీరు తదితర సౌకర్యాలపై రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ మోహన్, వీఆర్ఏలు ఉన్నారు.
Spread the love