- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని గోజేగావ్ గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్ పరిశీలించారు. శనివారం ఆయన వాడవాడలో పారిశుద్ధ్య పనులను దగ్గరుండి జరిపించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అపరిశుభ్రత ఎప్పటికప్పుడు తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ శుభ్రత ముఖ్యమని పేర్కొన్నారు. సర్పంచ్ దగ్గరుండి పారిశుద్ధ్య పనులు జరిపించడం గ్రామ ప్రజలు సర్పంచ్ తీరును హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



