నిపుణులతో కమిటీల ఏర్పాటు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ను పెట్టుబడులను ఆకర్షించేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తక్షణమే ప్రత్యేక వార్ రూమ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం అతిథులకు ఆహ్వాన పత్రాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్లోని మహాత్మా జోతిబా ఫూలే ప్రజాభవన్లో భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ఈ వార్ రూమ్ పర్యవేక్షణ బాధ్యతలను సీఎస్ పటిష్టం చేయాలని భట్టి సూచించారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలలో అవసరమైన నిపుణులను కీలక అధికారులను తీసుకోవాలని ఆయన చెప్పారు. గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల ప్రస్తుత పురోగతిపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు ప్రత్యేకంగా కమిటీకి బాధ్యతలు అప్పగించాలన్నారు. డిసెంబర్లో జరిగే సమ్మిట్ కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తృతంగా రోడ్షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షించాలని చెప్పారు. సమ్మిట్ పనుల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోజుకు కనీసం ఒక గంట కేటాయించి రోజువారీ సమీక్షలు నిర్వహించాలనీ, ప్రతి కమిటీకి కేటాయించిన బాధ్యతలను సయమపాలన ప్రకారం పూర్తి చేయాలని భట్టి స్పష్టం చేశారు.
పెట్టుబడులను ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



