ఎమ్మెల్యే కు కుర్చీ ఎంపీపీకి నిలబెట్టడమే అవమానం..

నవతెలంగాణ -మద్నూర్
మండల ప్రజల కల ఎట్టికేలకు నెరవేరింది. డిగ్రీ కళాశాల కోరిక తీరింది. జుక్కల్ ఎమ్మెల్యే హనమంతు సిందే కృషి ఫలితంగా మద్నూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు అయింది. డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే చేతులు మీదుగా ప్రారంభించారు. అనంతరం గదుల్లోకి వెళ్లి మొట్టమొదట ఒక అమ్మాయికి అడ్మిషన్ తీసుకునే సమయంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీపీకి అవమానం ఎందుకంటే అడ్మిషన్ తీసుకునే సమయంలో ఎమ్మెల్యే అనుమంతు షిండేకు మాత్రమే ఒకే ఒక కుర్చీ వేశారు. ఎమ్మెల్యే వెంటా ఉన్న ఎంపీపీకి మాత్రం కురిచి లేకుండా నిలబడటం అవమానపరచడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మండలానికి ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్న మహిళకు కుర్చీ వేయకుండా నిలబెడుతూ.. అడ్మిషన్ కార్యక్రమం ప్రారంభించడం మహిళల పట్ల గౌరవం లేకుండా అవమానమే జరిగినట్లు పలువురిలో చర్చించుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే ఎంపీపీకి కుర్చీ లేకుండా నిలబెట్టడం అధికారుల పనితీరుపై పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో ఇలా జరగడం సరైనది కాదని పలువురు భావిస్తున్నారు.
Spread the love