నిరుపేదలకు ఫ్రీగా టెస్టులు చేసి మెడిసిన్ కూడా ఇవ్వడం సంతోషకరం


నవతెలంగాణ కంటేశ్వర్: దుబ్బ బైపాస్ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరుగుతున్న భూ పోరాటం వద్ద స్వచ్ఛందంగా గవర్నమెంట్ సిబ్బంది వచ్చి ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాతనీ ఆశ్రయించి అక్కడే నివసిస్తున్న నిరుపేదలకు గురువారం ఫ్రీగ టెస్టులు చేసి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఐద్వా మహిళా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రత్యేకమైన క్యాంపు పెట్టాలి అని వారిని కోరడం జరిగింది దానికి వారు అంగీకరించి మళ్లీ ఒకసారి ప్రత్యేకమైన క్యాంపు ఏర్పాటు చేస్తామని టిఐ ప్రాజెక్ట్ మేనేజర్ మోహిమ్ హామీ ఇవ్వడం జరిగింది. వారి సిబ్బంది లాస్య మౌనిక, శ్రీకాంత్, వరలక్ష్మి, మహి, తదితరులు కలిసి క్యాంపు ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

Spread the love