సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

– కేటీఆర్ రోడ్డు షో  ను విజయవంతం చేయండి
– విలేకరు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 
నవతెలంగాణ – అచ్చంపేట 
సాధ్యం కానీ హామీలను ఇచ్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యాహ్నం 3.గంటలకు అచ్చంపేటకు వస్తున్నారు. నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షో ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో ప్రచారానికి వెళుతున్న సందర్భంగా బీఆర్ఎస్ కు ప్రజల నుంచి ఆదరణ బ్రహ్మాండంగా వస్తుంది అన్నారు. కచ్చితంగా లోక్ సభ ఎన్నికలలో టిఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కచ్చితంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజయం సాధిస్తారని పార్లమెంటుకు పంపిస్తామని అన్నారు. పార్టీని వీడిన కొందరు దుర్మార్గులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్లిపోయారని కానీ నికార్ట్స్ అయినా యువకులు ఉద్యమకారులు టిఆర్ఎస్ లోనే ఉన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన అవుతున్న రాష్ట్రాన్ని పరిరక్షించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.  విలేకరుల సమావేశంలో మునిసిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, శంకర్ మాదిగ ఉన్నారు.
Spread the love