నవతెలంగాణ – హైదరాబాద్
బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ సభ్యుడు ఈటల రాజేందర్ సోమవారం కేంద్రమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చునని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అమిత్ షాను కలిశారు. మరోవైపు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం అమిత్ షాను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.