నవతెలంగాణ – నల్గొండ: నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకులేదని.. కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అని చెప్పారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పోయిందన్నారు. తన పాలనలో ఎవరికీ ఏమీ తక్కువ చేయలేదని తెలిపారు.