కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఖిల్లా డిచ్ పల్లి మాజీ సర్పంచ్ రూప్ సింగ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారందరికీ జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.రానున్న ఎంపీ ఎన్నికల్లో గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు.బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపే ధ్యేయంగా పని చేయాలని జగన్ మోహన్ సూచించారు.పార్టీలో చేరిన వారిలో మోహన్ నాయక్, సుమన్, శ్రీను శేనియా గణేష్, శత్రు, గద్దర్ తదితరులు ఉన్నారు.
Spread the love