బీఆర్ఎస్ లో కాంగ్రెస్,బీజేపీ శ్రేణుల చేరికలు..

నవతెలంగాణ- బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట,తలారివాని పల్లి గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్,బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన అయా పార్టీల శ్రేణులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు అయా శ్రేణులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love