నేడు మేడిగడ్డకు జస్టిస్‌ చంద్రఘోష్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు మేడిగడ్డకు జస్టీస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు ఆదేశించిన నేపద్యంలో పర్యటించనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో దెబ్బతిని , కుంగిపోయిన పిల్లర్లను జ్యుడిషియల్ కమీషన్ చైర్మన్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం రామగుండంలోని‌ విశ్రాంతి గృహంలో రాత్రి బస చేయనున్నారు. కలకత్తా నుంచి సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం 5 గంటలకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులతో సమావేశమయ్యారు.

Spread the love