– పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
– ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన కార్మికుడు
నవతెలంగాణ-మోతె
ఇసుక ట్రాక్టర్ ఢకొీని మృతి చెందిన హమాలీ కార్మికుని కుటుం బానికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తోటి కార్మికులు, కుటుంబీకులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట, రహదారిపై పెద్దఎత్తున ధర్నా చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన హమాలీ కార్మికుడు మంద ఉపేందర్(32) ఆదివారం రాత్రి తుమ్మలపల్లి నుంచి మామిళ్లగూడెం వెళ్లే రోడ్డు మార్గంలో ఇసుక ట్రాక్టర్ ఢకొీని మృతి చెందాడు. కార్మికులు, కుటుంబీకుల ధర్నాతో ఖమ్మం సూర్యాపేట రహదారి మార్గంలో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సూర్యాపేట డీఎస్పీ రవి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి వచ్చి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.