కన్నతల్లి శాపం ఎంతో…కాంగ్రెస్ పార్టీ శాపం అటువంటిది

నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్
కన్నతల్లి శాపం ఎంతో… కాంగ్రెస్ పార్టీ శాపం అటువంటిది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపిటిసి ఎడ్ల సుగుణమ్మ  రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలంలోని కాచారం గ్రామంలో కాచారం సర్పంచ్ అరుణ అశోక్ రెడ్డి భర్త అశోక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను దూషించినందుకు ఎడ్ల రాంరెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో కాచారం గ్రామ సర్పంచ్ అరుణ అశోక్ రెడ్డిగా గెలిచి, అరుణ అశోక్ రెడ్డి, అశోక్ రెడ్డిలు డబ్బులు తీసుకొని కుటుంబ లాభం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం తగదన్నారు.
       బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కాచారము అభివృద్ధి చేస్తానని,  మట్టి గోడలను బంగారు గోడలను చేస్తానని అబద్ధపు వాగ్దానం చేశారని, కాచారానికి ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై దూషణలు తగదన్నారు. నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది అని, దూషించడం మానుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love