– పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి భార్య కొప్పుల ప్రతిమారెడ్డి
నవతెలంగాణ-దోమ
కసీఆర్ బీమా ప్రతి ఇంటా దీమా అని పరిగి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ రెడ్డి భార్య కొప్పుల ప్రతి మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఐనపూర్లో ఎమ్మెల్యే మహేష్రెడ్డి భార్య ప్రతిమారెడ్డి బీఆర్ఎస్ కార్య కర్తలు, నాయకులు వివిధ గ్రామాల్లో ప్రతి గడపగడప కూ తిరుగుతూ ఓటర్లను ప్రేమానురాగాలతో పలకరి స్తూ గ్రామాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు పోవడానికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ ఆశీర్వదించండని ప్రతిమారెడ్డి ఓటర్లను కోరా రు. సీఎం కేసీఆర్ ప్రజలకు మెరుగైన పథకాలను అంది స్తున్నాడని ప్రజలకు అవగాహన కల్పించారు. మహేష్ రెడ్డి మరోమారు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గార్లపల్లి మల్లేషం, గ్రామాధ్య క్షులు రుక్మయ్య గౌడ్, మహిళలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.