‘పైలెట్‌’ సతీమణి ప్రచారం హైలైట్‌

– ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి భార్యకు జన నీరాజనం
నవతెలంగాణ-తాండూరు
ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సతీమణి ప్రచారం లో హైలైట్‌గా నిలుస్తున్నారు. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతు న్నారు. తాండూరు నియోజ కవర్గంలోని వివిధ మండలాలతో పాటు పట్టణంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం జననీరాజనం పడ తున్నారు. మున్సి పల్‌ పరిధిలోని ఆయావార్డులో గడప గడపకూ వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలక రిస్తూ ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ల ను వేడుకుంటున్నారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 1వవార్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేని ఆశీ ర్వదించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దీపా నర్సింలు, ఫ్లోర్‌ లీడర్‌ శోభారాణి, కౌన్సిలర్‌ సం గీత ఠాకుర్‌, మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పరిమలళా, అనిత నాయకులు రాజ న్‌గౌడ్‌, కృష్ణ, సిరి యాదవ్‌, అనంత రెడ్డి, రమేష్‌, వెంకట్‌ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love