ముదిరాజ్ లను చిన్న చూపు చూసిన కేసీఆర్

– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
ముదిరాజు లకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ముదిరాజుల సామాజిక వర్గాన్ని కేసీఆర్ అవమానించారని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో ముదిరాజు సంఘ సభ్యులతో, హమాలీ సంఘ కూలీలను కలిసారు. ఈ సంద్భర్భంగా పొన్నం మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టి అధికారం లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. హమాలీ సంఘ నాయకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను ఎమ్మేల్యే గా గెలువ గానే వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగ మూర్తి, డిసిసి ప్రధాన కార్యదర్శి చిత్తారి రవి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్ లు చిత్తారి పద్మ, పున్న లావణ్య సదీ, వల్లపు రాజు, నాయకులు భూర్గు కిష్ట స్వామి, ఎండి హసన్, మైదం శెట్టి వీరన్న, పచ్చిమట్ల రాధ, కమలమ్మ, పూదరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love